ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఓటు వేయడం ఎలా?
ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సంఘం ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటు వేసే ప్రక్రియ ఎలా ఉంటుందో, ఓటర్లు ఏం చేయాలో తెలుసుకోండి.
ఓటు వేయడానికి అర్హత:
- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అర్హులు.
- ఓటర్ల జాబితాలో పేరు నమోదు అయి ఉండాలి.
ఓటు వేయడానికి ముందు:
- మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోండి. ఎలక్షన్ కమీషన్ వెబ్సైట్ లేదా సీవిజిల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
- మీ గుర్తింపు కార్డు సిద్ధంగా ఉంచుకోండి.
ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు:
- పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీలు ధరించకండి.
- సెల్ఫోన్లు తీసుకెళ్లకండి.
- అక్కడుండే భద్రతా సిబ్బందికి సహకరించండి.
ఓటు వేసే ప్రక్రియ:
- ఓటర్ లిస్ట్లో మీ పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు మిమ్మల్ని పోలింగ్ బూత్ లోకి పంపుతారు.
- మీ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు.
- రిజిస్టర్లో మీ వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు.
- పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ) దగ్గరికి వెళ్లి ఓటు వేయండి.
- సీయూలో బటన్ నొక్కిన తర్వాత మీరు ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.
ఓటు వేయడంలో ఇబ్బంది ఉంటే:
ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులున్నా, మీ ఓటు మరొకరు వేసినా వెంటనే పోలింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయండి.
పోలింగ్ సమయం:
- ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
- ఏ టైంలో అయినా వెళ్లి ఓటు వేయొచ్చు.
ప్రచారాలకు సమయం ముగియడం తో అమల్లోకి ఆంక్షలు
- సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
- ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
- ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.
- ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.
- పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.
- ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.
- మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.
- ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.
ఓటు హక్కును వినియోగించుకోండి!
మీ ఓటు చాలా విలువైనది. మీ ఓటుతో మీరు ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో నిర్ణయించుకోవచ్చు. ఈ నెల 13న తప్పకుండా ఓటు వేయండి. JAI HIND