ఆడుదాం ఆంధ్ర ఆన్ లైన్ లో దరఖాస్తు చేయు విధానం

ఆడుదాం ఆంధ్రా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయు విధానం 



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల. వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.

టోర్నమెంట్లు

      ఈ టోర్నమెంట్లు డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం.

ఆడుదాం ఆంధ్రాలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్  అవ్వడం ఎలా  

Step 1-ముందుగా ఆడుదాం ఆంధ్ర వెబ్ సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యాజ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి తో  లాగిన్ అవ్వాలి.

Website Link :   Click Here


Step 2-కాంపిటేటివ్ గేమ్స్ లో ఒకటి లేదా రెండు గేమ్స్ ని సెలెక్ట్ చేసుకోవలెను. తరువాత ఎంచుకున్న రెండు గేమ్స్ లో ప్రైమరీ గేమ్స్ కింద ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోవలెను. ఈ గేమ్స్ లో విజేతలకు అవార్డ్స్ మరియు రివార్డ్స్ ఉంటాయి.

నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఎడల అవి కూడా సెలెక్ట్ చేసుకోవలెను. వీటికి ఎటువంటి అవార్డ్స్ మరియు రివార్డ్స్ ఉండవు.

Step 3- మీ ఫోటో 1mb లోపల అప్లోడ్ చేయవలెను. అదేవిధంగా మీ డీటెయిల్స్ మరియు మీ వాలంటరీ యొక్క పేరు డిస్ప్లే చేయబడుతుంది. 

Step 4- చివరగా అక్కడ ఉన్న చెక్ బాక్స్ చదివి రెండిటిని ఒకే చేసిన తరువాత  క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వవలెను.

ఆన్ లైన్ లో మీ TEAM ధరకాస్తు చేసుకొనే  విధానం:-

Step 1:-  క్రికెట్ , వాలీ బాల్ వంటి TEAM EVENT  లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా పైన తెలిపిన విధంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక గ్రామ సచివాలయం నుండి ఎవరైతే మీ టీంలో ఆడాలి అనుకుంటున్నారో అంతమంది వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకావాలి.

STEP 2 :- తర్వాత అందులో ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ అయిన  మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి తరువాత My Team అని ఆప్షన్ను ఎంపిక చేసుకోగానే ఆ గ్రామ సచివాలయం పరిది లో ఆ ఆట కు సంబంధించి రిజిస్టర్ అయిన ప్లేయర్ల అంతమంది కనిపిస్తారు. 

STEP 3:- అక్కడ కనిపిస్తున్న  పేర్ల నుండి మీ టీం లో చేర్చుకోవలసిన వారి పేర్లను ఒక్కొక్కరుగా ఎంపిక చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేయర్ను ఎంపిక చేసుకోగానే ఆ ప్లేయర్ ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యున్నారో ఆ మొబైల్ నెంబర్ ను టైప్ చేసి GETOTP పై క్లిక్ చేయగానే అతని మొబైల్ నెంబర్ కు ఓటిపి వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే అతను మీ టీం లో నమోదు అవుతారు. ఈ విధంగా మీ టీంలో అంతమంది మెంబర్లను ఎంపిక చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ టీం తదుపరి లాగిన్లకు వెళుతుంది.

 రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు :-

  • 15 ఏళ్లు పైబడిన వారందరూ ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • పైన తెలిపిన విధంగా మీ మొబైల్ ఫోన్ సహాయం తో online లో Registration కావొచ్చు.
  • రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1092కి కాల్‌ చేయవచ్చు లేదా మీ సమీపంలోని సచివాలయాన్ని సంప్రదించవచ్చు.

ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు ప్రైజ్‌మనీ

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలకు నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలుగా ఉంది.

రెండో ప్రైజ్‌గా నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.

మూడో ప్రైజ్‌గా నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.

బ్యాండ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో మొదటి బహుమతి ప్రైజ్‌ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.

రెండో ప్రైజ్‌గా నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.1 లక్షగా నిర్ణయించారు.

మూడో ప్రైజ్‌ కింద నియోజకవర్గ స్థాయిలో రూ.5 వేలు, జిల్లాస్థాయిలో రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50 వేలుగా నిర్ణయించారు.

కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది:

గ్రామ/వార్డు సచివాలయ స్థాయి: 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50 లక్షల మ్యాచ్‌లు జరుగుతాయి.

మండల స్థాయి: 680 మండలాల్లో మొత్తం 1.42 లక్షల మ్యాచ్‌లు జరుగుతాయి.

నియోజకవర్గ స్థాయి: 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లు జరుగుతాయి.

జిల్లా స్థాయి: 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు జరుగుతాయి.

రాష్ట్ర స్థాయి: 250 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌తో పాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్‌ పోటీలు కూడా నిర్వహించబడతాయి.

విజేతలకు భారీగా నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు ఇవ్వబడతాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా పోటీల విజేతలకు భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు.


4 Comments

Previous Post Next Post